విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ₹3 కోట్ల‌ న‌ష్టం

పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం తెలంగాణ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం గుత్తేదారు కార్యాలయంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. విద్యుత్ కేంద్రం ప‌నుల‌ను టాటా సంస్థ చేప‌డుతోంది.

Published : 31 May 2021 01:05 IST

రామ‌గుండం: పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం తెలంగాణ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం గుత్తేదారు కార్యాలయంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. విద్యుత్ కేంద్రం ప‌నుల‌ను టాటా సంస్థ చేప‌డుతోంది. విద్యుదాఘాతం వ‌ల్ల ఎయిర్‌కండిషన్ ప‌రిక‌రాలు ద‌గ్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.3 కోట్ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు టాటా కార్యాల‌యం నిర్వాహ‌కులు తెలిపారు. ఎన్టీపీసీ, గోదావ‌రిఖ‌ని అగ్నిమాప‌క సిబ్బంది సంయుక్తంగా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుదాఘాతానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని