Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలోని మైలాన్‌ పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.

Updated : 08 Jan 2023 16:41 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్‌ పరిశ్రమలో వేర్‌హౌస్‌ బ్లాక్‌లో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్‌ మేనేజర్, శ్రీకాకుళం వాసి లోకేశ్వర్‌రావు (38), కార్మికులు బెంగాల్‌ వాసి పరితోష్‌ మెహతా (40), బిహార్‌ వాసి రంజిత్‌ కుమార్‌ (27) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఐడీఏ బొల్లారం పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని