Crime News: రథోత్సవంలో అగ్నిప్రమాదం.. 11 మంది భక్తుల సజీవదహనం

తమిళనాడు తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్‌ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో

Updated : 27 Apr 2022 09:24 IST

తంజావూరు: తమిళనాడు తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్‌ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11మంది భక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న రథం గుడికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతం జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు