అనంతపురం జిల్లా కూడేరులో అగ్ని ప్రమాదం

అనంతపురం జిల్లా కూడేరులోని పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో ఉన్న సుజ్లాన్‌ పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి చెందిన ..

Updated : 08 Mar 2021 01:25 IST

కూడేరు: అనంతపురం జిల్లా కూడేరులోని పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో ఉన్న సుజ్లాన్‌ పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి చెందిన వ్యర్థాలకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నిప్పు పెట్టిన కాసేపటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉత్పత్తి కేంద్రానికి కొద్ది దూరంలో మంటలు చెలరేగినప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం వరకు వ్యాపించకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటనా స్థలాన్ని ఎస్సై యువరాజ్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని