Crime News: మంచిర్యాల జిల్లాలో ఘోరం.. ఒకే ఇంట్లో ఆరుగురి సజీవ దహనం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఘోరం జరిగింది. వెంకటాపూర్‌ పంచాయతీలోని వుడిపెల్లిలోని ఓ ఇంట్లో ఆరుగురు సజీవదహనమయ్యారు. 

Updated : 17 Dec 2022 08:43 IST

మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఘోరం జరిగింది. వెంకటాపూర్‌ పంచాయతీలోని వుడిపెల్లిలోని ఓ ఇంట్లో ఆరుగురు సజీవదహనమయ్యారు.  గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతిచెందిన వారిలో మాసు శివయ్య(50), ఆయన భార్య మాసు పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక (25), మరో ఇద్దరు చిన్నారులతో పాటు సింగరేణి ఉద్యోగి శాంతయ్య(50) ఉన్నారు. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక రెండు రోజుల క్రితమే పద్మ వాళ్లింటికి వచ్చారు. డీసీపీ అఖిల్‌ మహాజన్‌, సీఐ ప్రమోదరావు ఘటనాస్థలికి  చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని