Khammam: ద్విచక్రవాహనానికి మంటలు అంటుకొని.. కాలిపోయిన వ్యక్తి!

ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో ద్విచక్రవాహనానికి మంటలు అంటుకొని వాహనంతోపాటు ఓ వ్యక్తి కాలిపోయాడు.

Published : 03 Jan 2022 01:25 IST

తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో ద్విచక్రవాహనానికి మంటలు అంటుకొని వాహనంతోపాటు ఓ వ్యక్తి కాలిపోయాడు. ఎన్టీఆర్ నగర్ వద్ద వరి పొలం పక్కన ఓ వ్యక్తి ద్విచక్రవాహనం నిలిపి ఉంచాడు. ప్రమాదవశాత్తు వాహనానికి నిప్పు అంటుకోవడంతో పక్కనే ఉన్న వరి గడ్డికి వ్యాపించింది. మంటలు ఎగిసిపడుతూ ఆ వ్యక్తికి కూడా అంటుకున్నాయి. కాలిన గాయాలతో పరుగులు తీస్తూ రహదారిపైకి వచ్చిన ఆ వ్యక్తిని స్థానికులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేప్టటారు. ఘటనా స్థలంలో దొరికిన గుర్తింపుకార్డు ఆధారంగా ఆ వ్యక్తిని కోదాడకు చెందిన గోపాల్‌గా గుర్తించారు. ఘటన ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని