Andhra News: కారులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో

Updated : 17 May 2022 19:22 IST

మార్కాపురం: ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ అంజనేయులు రెడ్డి, ఎస్సై సుమన్‌, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కారు డ్రైవర్‌ను చిత్తూరు జిల్లా భాకరాపేటకు చెందిన రావూరి తేజ(35)గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని