Hyderabad: లక్డీకాపూల్ వద్ద నడిరోడ్డుపై కారు దగ్ధం.. భారీగా ట్రాఫిక్ జామ్
నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్లో ఉన్న వేంకటేశ్వర హోటల్ సమీపంలో ఉన్న రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంకు వైపు వెళ్తుండగా వేంకటేశ్వర హోటల్ సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. వరంగల్కు చెందిన వ్యాపారి సామల వంశీకృష్ణ కారుగా పోలీసులు గుర్తించారు. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో లక్డీకాపూల్ ప్రాంతమంతా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!