Fireworks explosion: బాణసంచా పేలుడు.. ఐదుగురి మృతి

ఒడిశాలోని ఖుర్దా జిల్లా భూసంగపూర్‌లో బాణసంచా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Published : 06 Mar 2023 13:47 IST

కటక్‌: ఒడిశాలోని ఖుర్దా జిల్లా భూసంగపూర్‌లో బాణసంచా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డోలా పూర్ణిమ సందర్భంగా ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా సోమవారం ఉదయం ఈ పేలుడు జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

పేలుడు జరిగిన నివాసంలో ఇంకా ఎవరైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని సమాచారం. భారీ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని