చెన్నైలో కాల్పుల కలకలం

చెన్నైలోని ఓ ఇంటిలోకి చొరబడిన దుండగులు ఒక వ్యాపారి కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. పారిస్‌ కార్నర్‌లోని షావుకారుపేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Published : 12 Nov 2020 01:19 IST

చెన్నై: చెన్నైలోని ఒక వ్యాపారి ఇంటిలోకి చొరబడిన దుండగులు కుటుంబంలోని ముగ్గురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. పారిస్‌ కార్నర్‌లోని షావుకారుపేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఫైనాన్స్‌ వ్యాపారి దలీల్‌ చంద్‌(74),ఆయన భార్య కుషాల్‌ భాయ్‌(70) కుమారుడు సీతల్‌ (38) ఘటనాస్థలంలోనే ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘాతుకానికి ఎవరు ఒడిగట్టారనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని