Hyderabad News: స్థిరాస్తి వ్యాపారులపై కాల్పులు.. ఇద్దరి మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగూడ గ్రామ సమీపంలో స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాస్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి రాఘవేందర్రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం కర్ణంగూడకు వెళ్లే మార్గంలో స్థానికులు ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. కారుపై రక్తపు మరకలు ఉండటంతో దగ్గరికి వెళ్లి చూడగా అందులోని ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ బీఎన్రెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో గాలించగా అప్పటికే మృతిచెందిన శ్రీనివాస్రెడ్డి కనిపించారు. అతడి స్వగ్రామం అల్మాస్గూడగా గుర్తించారు.
బాధితుడిని పరీక్షించిన వైద్యులు అతడి ఛాతీ కింద భాగంలో బుల్లెట్ గాయమైందని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చికిత్స పొందుతూ రాఘవేందర్రెడ్డి ఆస్పత్రిలో మృతిచెందారు. వాహనం నంబర్ ఆధారంగా బాధితుడు అంబర్పేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారిగా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో వీరికి ఏమైనా గొడవలున్నాయా? కాల్పులు జరపడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతులు శ్రీనివాస్రెడ్డి, రఘు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పటేల్గూడలోని 22 ఎకరాల్లో శ్రీనివాస్రెడ్డి, రఘు, మట్టారెడ్డి వెంచర్ వేశారు. వెంచర్ విషయంలో ఈ ముగ్గురి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీనివాస్రెడ్డి, రఘు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వెంచర్ విషయంలో మాట్లాడదామని వీరిద్దరినీ మట్టారెడ్డి పిలిపించారంటూ బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. కాల్పులకు అతడే కారణమని వారు అనుమానిస్తున్నారు. దీంతో మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు
ఈ ఉదయం శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి వెంచర్ వద్దకు వెళ్లారు. వెంచర్ సమీపంలో పాయింట్ బ్లాంక్లో శ్రీనివాస్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులతో భయపడిన రాఘవేందర్రెడ్డి కారులో పారిపోవడానికి యత్నించగా గుర్తు తెలియని వ్యక్తి అతడిని వెంబడించి కాల్పులు జరిపినట్లు సమాచారం. శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిపై గతంలో కేసులున్నట్లు పోలీసులు తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్