Road Accidents: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. ఆరుగురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 

Published : 16 Jan 2022 11:56 IST

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి చౌటుప్పల్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ధర్మోజీగూడెంలో ఆదివారం ఉదయం ఓ కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన చందు(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన సాయి పృథ్వీరాజ్‌(23) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి.

లింగోజిగూడెం వద్ద ముగ్గురు.. 

చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకుల్లో తండ్రి మృతిచెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన రెండు గంటల తరువాత అదే స్థలంలో మరో ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్‌, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు చిట్యాల మండంలం వెలిమినేడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులుగా పోలీసులు భావిస్తున్నారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని