Road Accident: చెరువు కట్టపై ట్రాక్టర్‌ బోల్తా.. ఐదుగురి దుర్మరణం

వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ శివారు దూసముద్రం చెరువు కట్టపై అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో

Updated : 18 May 2022 15:38 IST

ఖానాపురం: వరంగల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ శివారు దూసముద్రం చెరువు కట్టపై అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. హర్షనాయక్‌ తండాకు చెందిన ధన్‌సింగ్‌ కుటుంబం నర్సంపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గరు మృతిచెందగా.. ఇద్దరు నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

మృతుల్లో గుగులోతు స్వామి (48), గుగులోతు సీత (45), జాటోతు గోవిందు (65), జాటోతు బిచ్చమ్మ (60), గుగులోతు శాంతమ్మ (40) ఉన్నారు. మరో నలుగురి గాయాలు కావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 24న ధన్‌సింగ్‌ కుమార్తె వివాహం ఉండటంతో పెళ్లి సామగ్రి కొనుగోలుకు నర్సంపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నర్సంపేట ఏసీపీ సంపత్‌రావుతో పాటు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని