Crime news: విషాదం.. టీతాగి ఐదుగురు మృతి

ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతిచెందిన ఘటన యూపీలోని నాగ్లా కన్హై గ్రామంలో జరిగినట్టు  పోలీసులు వెల్లడించారు.

Published : 28 Oct 2022 01:38 IST

మెయిన్‌పురి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇల్లాలు చేసిన పొరపాటు పనికి ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి! ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతిచెందిన ఘటన నాగ్లా కన్హై గ్రామంలో గురువారం జరిగినట్టు ఎస్పీ కమలేశ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శివానందన్‌ (35), అతడి కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్రసింగ్‌ (55) పొరుగింటి వ్యక్తి సోబ్రాన్‌ (45) ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే రవీంద్రసింగ్‌, శివాంగ్, దివ్యాన్ష్‌ ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోబ్రాన్‌, శివానందన్‌ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వారిని సైఫాయి ఆస్పత్రికి తరలించగా అక్కడ వారిద్దరూ ప్రాణాలు విడిచారు. అయితే, శివానందన్‌ భార్య వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకొని కలిపేయడంతో అది విషపూరితమై ఈ పెను విషాదానికి కారణమైనట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని