Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌

Updated : 15 Aug 2022 21:11 IST

బీదర్‌: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న గిరిధర్‌.. తన 10 మంది కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్‌లో దత్తాత్రేయ స్వామి దర్శనానికి కారులో వెళ్తున్నారు. బీదర్‌ జిల్లాలోని బంగూరు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు కంటైనర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులు గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేశ్‌ (2), డ్రైవర్‌ జగదీశ్‌ (35)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని బీదర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని