Andhra News: అనంతపురంలో మధ్యాహ్న భోజనం తిని 40మంది విద్యార్థులకు అస్వస్థత
అనంతపురం జిల్లా కక్కల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు
అనంతపురం గ్రామీణం: అనంతపురం జిల్లా కక్కల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమచారం అందించారు. వారు వచ్చిన తర్వాత అంబులెన్సుల్లో విద్యార్థులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మల్లేశ్వరి వెల్లడించారు. రేపటి వరకు విద్యార్థులను పర్యవేక్షణలో ఉంచుతామని సూపరింటెండెంట్ తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన డీఈఓ శామ్యూల్పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని పిల్లల వార్డు వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పిన డీఈఓ.. ఈ ఘటనకు బాధ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.