Crime News: కర్ణాటకలో ఘోర ప్రమాదం.. నలుగురు హైదరాబాద్‌ వాసుల మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి చెందారు.

Updated : 16 Feb 2023 19:40 IST

హైదరాబాద్‌: కర్ణాటకలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. టీఎస్‌ 29పీ 3693 కారులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు విహార యాత్రకు వెళ్తుండగా కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద మరో వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్‌గా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని