Crime News: నంద్యాలలో హోంగార్డుపై నలుగురి దాడి.. తలకు తీవ్ర గాయమై మృతి

నంద్యాలలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సీడబ్ల్యూసీ)లో పనిచేసే హోంగార్డు శేఖర్‌ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీడబ్ల్యూసీ కార్యాలయంలోకి

Updated : 11 Apr 2022 11:26 IST

నంద్యాల: నంద్యాలలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సీడబ్ల్యూసీ)లో పనిచేసే హోంగార్డు శేఖర్‌ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీడబ్ల్యూసీ కార్యాలయంలోకి వచ్చిన నలుగురు వ్యక్తులు తిరిగి వెళుతుండగా హోంగార్డు వారిని వారించారు. కార్యాలయంలోకి ఎందుకొచ్చి వెళుతున్నారని అడగ్గా.. ఆ నలుగురు వ్యక్తులు హోంగార్డుపై దాడి చేసి నెట్టారు. దీంతో అతను గేటుపై పడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించే లోపే శేఖర్‌ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని