Tamil nadu: తమిళనాట బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: నలుగురు మృతి
కొత్త సంవత్సరం మొదలైన ఐదు రోజుల్లోనే తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూర్లోని బాణసంచా ఫ్యాక్టరీలో రెండోసారి పేలుడు...
కొత్త సంవత్సరంలో రెండోసారి ప్రమాదం
విరుదునగర్: కొత్త సంవత్సరం మొదలైన ఐదు రోజుల్లోనే తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూర్లోని బాణసంచా ఫ్యాక్టరీలో రెండోసారి పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాత్తూర్ సమీపంలోని ఏళాయిరం పణ్నై మంజల్వోడై పట్టి ప్రాంతంలో కరుప్పస్వామి అనే వ్యక్తికి చెందిన బాణాసంచా కర్మాగారం నడుస్తోంది.ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో 10మందికి పైగా కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా పేలుడు చోటుచేసుకుంది. ఘటనలో బాణసంచా ఫ్యాక్టరీ యజమాని కరుప్పస్వామి సహా నలుగురు మృతిచెందారు.పేలుడు దాటికి ఓ గది పూర్తిగా నేల మట్టమైంది. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పిన అగ్గిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏళాయిరం పణ్నై పోలీసులు తెలిపారు. బాణాసంచా రసాయనాలు కలుపుతుండగా రాపిడి కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.ఈనెల 1న సాత్తూర్ సమీపంలోని కళత్తూర్ గ్రామంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 7గురు గాయపడిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?