crime: అడవి పందుల అక్రమ రవాణా గుట్టు రట్టు..

అక్రమంగా అడవి పందులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా నూజువీడు-అన్నవరం బైపాస్‌ రహదారిలో సాధారణ వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో బొలేరో వాహనంలో అడివి పందులు కనిపించాయి.  విచారణ చేపట్టగా అక్రమ వ్యవహారం బయటపడింది.

Published : 26 Mar 2022 22:41 IST

కృష్ణా జిల్లా: అక్రమంగా అడవి పందులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు-అన్నవరం బైపాస్‌ రహదారిలో సాధారణ వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో బొలేరో వాహనంలో అడివి పందులు కనిపించాయి.  విచారణ చేపట్టగా అక్రమ వ్యవహారం బయటపడింది. రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. బొలేరో వాహనంలో మొత్తం 18 అడవి పందులు ఉండగా అందులో ఒకటి మృతి చెందింది. మిగతా 17 అడవి పందులను అటవీ శాఖాధికారులకు అప్పగించారు. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని