- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
నల్గొండలో నకిలీ విత్తనాల గుట్టురట్టు
రూ.6 కోట్లు విలువైన విత్తనాలు స్వాధీనం
నల్గొండ: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా బయటపడింది. సుమారు రూ.6 కోట్లు విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.4 కోట్లు విలువైన 20 టన్నుల పత్తి, రూ.2 కోట్లు విలువైన 200 టన్నుల వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధుసూదన్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా నైరుతీ సీడ్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, ఎంజీ అగ్రీటెక్ ప్రతినిధులు ఈ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మధుసూదన్ రెడ్డి నకిలీ విత్తనాలు విక్రయిస్తూ గత ఏడాది పట్టుబడడంతో పీడీ యాక్ట్ పెట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ మళ్లీ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నాసిరకం, గడువు ముగిసిన విత్తనాలను సేకరించి వాటికి రంగులు వేసి ఏమాత్రం అనుమానం రాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఉండేలా ఈ దందా సాగిస్తున్నట్లు వివరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సంస్థ పేరు వచ్చేలా పకడ్బండదీగా ప్యాకెట్లపై ముద్రించి మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అనుమానం వచ్చి విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసినప్పటికీ నకిలీ విత్తనాలని గర్తించడం దాదాపు అసాధ్యం అనే విధంగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారని చెప్పారు. సుమారు 40 వేల ఎకరాలకు సరిపడా నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించారని.. సకాలంలో వారిని పట్టుకోవడంతో సుమారు లక్ష మంది రైతులను కాపాడగలిగామని ఎస్పీ వివరించారు.
ఇదే నెలలో సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలు తయారు చేసి రైతుల్ని మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం కేంద్రంగా ద్వారకా సీడ్స్ పేరుతో గత కొంతకాలంగా నిర్వహించిన ఈ అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేసి రూ.13 కోట్లు విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Kapil Dev: వన్డే, టెస్టు ఫార్మాట్లను ఐసీసీ కాపాడాలి: కపిల్దేవ్
-
India News
Jammu and Kashmir: నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి
-
India News
‘వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. నేను బెయిల్ ఇప్పిస్తా’
-
Movies News
Highway: ఉత్కంఠగా ‘హైవే’ ట్రైలర్.. కొత్త లుక్లో ఆనంద్ దేవరకొండ
-
General News
TS High Court: కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Ravindra Jadeja: చెన్నైతో ఇన్నింగ్స్ ముగిసినట్లే!
- Indian Army: 1984లో గల్లంతైన జవాను ఆచూకీ లభ్యం
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్కే ఎక్కువ అవకాశాలు..!
- చాటింగ్ చేసిన చీటింగ్.. ప్రియుడిని ‘బాంబర్’గా అభివర్ణించిన ప్రియురాలు