Andhra News: పక్కింట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి పైకప్పు కూలడంతో నలుగురి మృతి

అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది.

Updated : 28 May 2022 15:44 IST

శెట్టూరు: అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ పేలింది. దీంతో పక్కనున్న ఇంటి పైకప్పు కూలిపోయి అందులోని నలుగురు మృతి చెందారు. సిలిండర్‌ పేలిన ఇంట్లో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ములకలేడులో నివాసం ఉండే రజాక్ సాహెబ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఘటనలో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్‌ కూడా గాయపడ్డారు. సిలిండర్‌ పేలడంతో పక్కిళ్లు కూలిపోయి అందులో నిద్రిస్తున్న నలుగురు చనిపోయారు. మృతిచెందిన వారిని దాదు(35), షర్ఫునా(30), ఫిర్దోజ్(6), జైనుబి(60)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పైకప్పు శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని