Gaza: బర్త్ డే వేడుకల్లో పెను విషాదం.. ఒకే కుటుంబంలో 17మంది మృతి
గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులంతా బర్త్ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ పెద్ద కుటుంబమే బలైపోయింది.
గాజా: గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యులంతా బర్త్ డే వేడుకల సందడిలో ఉండగా.. ఆ క్షణంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి ఓ కుటుంబమే బలైపోయింది. అపార్ట్మెట్లో పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలల ధాటికి 21మంది బలైపోగా.. వీరిలో 17మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉండటం అందరినీ హృదయాలను కలిచివేస్తోంది. జబాలియా శరణార్థుల శిబిరం ప్రాంతంలో గురువారం రాత్రి ఓ మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఇంట్లో నిల్వ చేసిన పెట్రోల్ (gasoline) వల్లే ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఈ పెట్రోల్ ఎలా మండిందనే అంశంపై మాత్రం స్పష్టత లేదని.. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
రెండు వేడుకలు ఒకేచోట.. అంతా ఆనందం.. అంతలోనే విషాదం..
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా గాజా ప్రాంతం నిత్యం బాంబు మోతతో దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా చెలరేగిన హింస కాకుండా గత కొన్నేళ్లలో అత్యంత ఘోరమైన సంఘటన ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. అబు రాయ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తున్న ఈ భవనంలోని పైఅంతస్తులో చెలరేగిన మంటలు అపార్ట్మెంట్ను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపారు. ఈ ఘటనపై అబూ రయా కుటుంబానికి చెందిన మరో వ్యక్తి మహ్మద్ అబూరయా మాట్లాడారు. ఆ పెద్ద కుటుంబంలో ఒక చిన్నారి పుట్టిన రోజు వేడుకలతో పాటు ఈజిప్టు పర్యటన నుంచి ఒకరురావడంతో రెండు వేడుకలు ఒకేసారి నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ మంతా ఒకేచోట చేరి ఆనందంగా గడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని నాశనం చేసిందని వాపోయారు. బంధువుల రోదనలు మిన్నంటడంతో పాటు ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. వీరి మృతదేహాలను ఉత్తర గాజాలోని ఇండోనేషియా ఆసుపత్రిలో ఉంచినట్టు పేర్కొన్నారు.
ఏం జరిగిందో చెప్పేందుకు ఎవరూ మిగల్లేదు..
ఇంట్లో పెట్రోల్ నిల్వ చేయడం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తల్ని కొట్టిపారేసిన మహ్మద్ అబూరయా.. ఫర్నిచర్ ఎక్కువగా ఉండటం వల్లే మంటలు తీవ్రత అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్తు ఎలా జరిగిందో వాస్తవాలు చెప్పేందుకు ఎవరూ సజీవంగా మిగల్లేదని వాపోయారు. ఇది పెట్రోల్ నిల్వ చేయడం వల్ల జరిగిందని తాను అనుకోవడంలేదని తెలిపారు. మృతుల్లో అబూరయా కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నట్టు పేర్కొన్నారు. 15ఏళ్ల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్ హమాస్ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇజ్రాయెల్-ఈజిప్టు సరిహద్దు దిగ్బంధనం కారణంగా గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శీతాకాలం కోసం ప్రజలు తరచూ ఇళ్లలో వంట గ్యాస్ ,డీజిల్, పెట్రోల్ నిల్వ చేసుకుంటుంటారు. గతంలో కొవ్వొత్తులు ,గ్యాస్ లీకేజీల వల్ల ఇళ్లలో మంటలు చెలరేగిన అనుభవాలు కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం