
ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ సభ్యుల పరస్పర దాడి
10 మందికి గాయాలు
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య జరిగిన కొట్లాటలో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. దిల్లీలోని జేఎన్యూ విద్యార్థులపై దాడికి నిరసనగా అహ్మదాబాద్లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలు వీరిపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
మరోవైపు ఈ దాడిని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్కుందన్ తీవ్రంగా ఖండించారు. భాజపా నిరంకుశ ప్రవర్తన ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భాజపా నిజరూపం ఇప్పుడు బయటపడింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తోంది’’ అని ఆరోపించారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై దాడిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. ‘‘ ఇది ఏబీవీపీ గూండాలు చేసిన దుశ్చర్య. దీనిలో వారి అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. అమాయక విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని భాజపా ఎలా సమర్థిస్తుంది. భారత్ను రణక్షేత్రంగా తయారు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఆదివారం రాత్రి దిల్లీ జేఎన్యూలో జరిగిన దుండగుల దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ సహా మరో 34 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని జేఎన్యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: ఆహారం కోసం ప్రియాంక ఎదురుచూపులు.. రకుల్ప్రీత్ హాట్ స్టిల్!
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్ 284 ఆలౌట్.. టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
-
Politics News
Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్
-
World News
Pakistan: పాక్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
World News
Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి