ఆ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు లేవు
దిల్లీ: సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలు అధికంగా పడటం వల్ల పంటలు నష్టపోయి ఇతరత్రా కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసలు రైతుల ఆత్మహత్యలే లేవని జాతీయ క్రైమ్
దిల్లీ: పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, వర్షాలు అధికంగా పడటం వల్ల పంటలు నష్టపోయి ఇతరత్రా కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసలు రైతుల ఆత్మహత్యలే లేవని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2018లో దేశవ్యాప్తంగా సుమారు 1,34,516 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదికలో పేర్కొంది. అందులో 10,349 మంది రైతులు ఉన్నారు. 2017తో పోల్చుకుంటే 2018లో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. బిహార్, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్, మేఘాలయ, గోవా, డామన్ డయ్యూ, దిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలో రైతుల ఆత్మహత్యలు లేవని ఎన్సీఆర్బీ తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. మహారాష్ట్ర (17,972), తమిళనాడు(13,896), పశ్చిమ బెంగాల్(13,255), మధ్యప్రదేశ్(11,775), కర్ణాటక(11,561) రాష్ట్రాల్లో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా రికార్డులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో సుమారు 50 శాతం మంది ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. మిగతా 49.1 శాతం మంది 24 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్లో అత్యంత తక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు