బాంబు బెదిరింపు..విమానం ల్యాండింగ్
పశ్చిమబెంగాల్ కోల్కతా నుంచి ముంబయికి బయల్దేరిన ఓ విమానం గంట సేపటి తర్వాత అక్కడికే వచ్చి ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి తన శరీరానికి బాంబులు ఉన్నాయని సిబ్బందికి తెలియజేయడంతో పైలట్లు అప్రమత్తమై వెనక్కి మళ్లించారు.
కోల్కతా: కోల్కతా నుంచి ముంబయికి బయల్దేరిన ఓ విమానం గంట సేపటి తర్వాత అక్కడికే వచ్చి ఆదివారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువతి తన శరీరానికి బాంబులు ఉన్నాయని సిబ్బందికి తెలియజేయడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఏసియాకు చెందిన విమానం (15316) ఆదివారం ఉదయం 9.57గంటలకు కోల్కతా నుంచి ముంబయికి బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన గంట సమయం తర్వాత అందులో ప్రయాణిస్తున్న మోహినీ మొండాల్ (25) అనే యువతి ఒక నోట్ రాసి కేబిన్ సిబ్బందికి ఇచ్చారు. అనంతరం దాన్ని విమాన కెప్టెన్ ఇవ్వమని సిబ్బందికి సూచించారు. ఆ నోట్లో ఆమె ‘తన శరీరానికి బాంబులు అమర్చినట్లు.. వాటిని ఆమె ఏ క్షణంలోనైనా పేల్చవచ్చు’ అని తెలియజేసినట్లు పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు(ఏటీసీ) తెలియజేసి విమానాన్ని వెనక్కి మళ్లించారు. అప్పటికే విమానాశ్రయంలో అప్రమత్తమైన అధికారులు 11.46 గంటలకు దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై అన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వారు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా