పోలీస్‌ స్టేషన్‌లోనే చోరీ...

మహారాష్ట్రలో ఓ పోలీస్‌స్టేషన్‌లో చోరీ ఘటనలో ఒకటో రెండో కాకుండా ఏకంగా 185 మొబైల్‌ ఫోన్లు దొంగతనానికి గురయ్యాయి.

Published : 14 Jan 2020 00:48 IST

స్టోర్‌ రూం నుంచి 185 ఫోన్ల అపహరణ

పుణె (మహారాష్ట్ర): మహారాష్ట్రలో కొల్హాపూర్‌ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో చోరీ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకటో రెండో కాకుండా ఏకంగా 185 మొబైల్‌ ఫోన్లు దొంగతనానికి గురికావటం గమనార్హం. కొల్హాపూర్‌కు 38 కిలోమీటర్ల సమీపంలోని జైసింగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న 185 మొబైల్‌ ఫోన్లను ఇక్కడి స్టోర్‌రూములో ఉంచారు. ‘‘ఈ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వివిధ దొంగతనాలు ఇంకా ఇతర కేసులతో సంబంధమున్న వివిధ ఫోన్లను ఉంచటానికి ఒక గదిని కేటాయించాము. ఈ గురువారం రాత్రి గుర్తుతెలియని ఆగంతకులు ఆ గదిలోకి దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఉన్న 185 ఫోన్లను తస్కరించారు.’’ అని సంబంధిత పోలీసు అధికారి ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని