హైదరాబాద్‌లో కాళ్లు,చేతులు కట్టి ఉరేశారు!

గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో...

Published : 20 Jan 2020 00:53 IST

పహడీ షరీఫ్: గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి ఉరివేసిన ఘటన హైదరాబాద్‌ శివారులో చోటుచేసుకుంది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. దేవతలగుట్ట మార్గంలోని గేట్‌కు ఓ యువకుడి మృతదేహం వేలాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని బాలాపూర్‌ బస్తీకి చెందిన ప్రశాంత్‌గా(23) గుర్తించారు. ప్రశాంత్‌కు తల్లిదండ్రులు లేరని..తన అన్న శ్రీకాంత్‌ వద్ద ఉంటున్నాడని స్థానిక ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. ఘటనపై మృతుడి అన్న శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. ప్రశాంత్‌కు ఎవరితోనూ గొడవలు లేవని శ్రీకాంత్‌ పోలీసులకు చెప్పాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని బాలాపూర్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని