మమత వృద్ధాశ్రమంపై కేసు నమోదు
కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని నాగారంలో ఉన్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో
హైదరాబాద్: కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని నాగారంలో ఉన్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారు. ఇరుకు గదుల్లో 73 మంది మానసిక వికలాంగులను గొలుసులతో బంధించారు. ఆశ్రమం నిర్వాహకులు వికలాంగులను కర్రలతో కొడుతున్నట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. ఒక్కో మానసిక వికలాంగుడి నుంచి నెలకు రూ.5వేల నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్న నిర్వాహకులు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతిలేకుండా మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కీసర పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్