రెండు తలల పాము రూ.13లక్షలకు!

రెండు తలల పామును రూ.13లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని తరలిస్తుండగా సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ముఠా సభ్యులను చేవెళ్ల వద్ద శుక్రవారం సాయంత్రం

Updated : 25 Jan 2020 07:39 IST

చేవెళ్ల: రెండు తలల పామును రూ.13లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని తరలిస్తుండగా సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ముఠా సభ్యులను చేవెళ్ల వద్ద శుక్రవారం సాయంత్రం వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి పాముతో పాటు రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని చేవెళ్ల పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఓటీ ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అసత్‌, ముజాయిద్‌, ఖదీర్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి రెండు తలల పామును విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ ఎస్సైతోపాటు ఏఎస్‌ఐ అంతిరెడ్డి, కానిస్టేబుళ్లు ఖలీల్‌, వెంకటేష్‌ బీజాపూర్‌ రహదారిపై కాపుకాసి చేవెళ్ల పట్టణంలోని ఓ దాబా సమీపంలో నిందితులను పట్టుకున్నారు. వారిని ఎస్సై రేణుకారెడ్డికి అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని