భారీ దాడులకు ప్లాన్‌.. ఉగ్రవాదులు హతం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. గతేడాది పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడుల్లో కీలక పాత్ర పోషించిన

Updated : 26 Jan 2020 01:57 IST

శ్రీనగర్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులు చేయాలన్న ఉగ్రవాదుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. గతేడాది పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ దాడుల్లో కీలక పాత్ర పోషించిన జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కీలక నేత క్వారీ యాసిర్‌ను బలగాలు శనివారం హతం చేశాయి. కశ్మీర్‌లోని అవంతిపురలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో యాసిర్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. దీనికి సంబంధించిన వివరాలను లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ దిల్లన్‌, ఐజీ విజయ్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో భారీ దాడులకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు వారు తెలిపారు. కాగా.. దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని