జేఎన్యూ మాజీ విద్యార్థిపై కేసు
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, సీఏఏకి వ్యతిరేకంగా దిల్లీ షాహిన్భాగ్లో ఆందోళనలకు నేతృత్వం వహిస్తు్న్న వారిలో ఒకరైన షార్జిల్ ఇమామ్పై దిల్లీ పోలీసులు....
దిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, సీఏఏకి వ్యతిరేకంగా దిల్లీ షహిన్భాగ్లో ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన షార్జిల్ ఇమామ్పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత ఎన్ఆర్సీపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 13న జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మతరపరమైన అల్లర్లకు, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కారణమవుతాయన్న కారణంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అతను మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్ వైరల్గా మారింది. దేశం నుంచి అసోంను తొలగించాలని ఆ వీడియోలో ఉంది. తనకే గనుక ఐదు లక్షల మంది మద్దతు ఉంటే ఆ పనిచేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 153ఏ, 505 కింద దిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే జనవరి 16న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో చేసిన వ్యాఖ్యలపై అసోం పోలీసులు ఉగ్రవాద నిరోదక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా