సరదాగా ఉరి..ప్రమాదవశాత్తూ భర్త మృతి!

భార్యకు ఉరేసుకోవడం గురించి చెబుతూ ప్రమాదవశాత్తూ గొంతుకు తాడు బిగుసుకుని నూతన వరుడు మృతి చెందారు.  తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురానికి

Updated : 29 Jan 2020 07:41 IST

ట్రిప్లికే, న్యూస్‌టుడే: భార్యకు ఉరేసుకోవడం గురించి చెబుతూ ప్రమాదవశాత్తూ గొంతుకు తాడు బిగుసుకుని నూతన వరుడు మృతి చెందారు.  తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురానికి చెందిన మహ్మద్‌ అలీ(22)కి రెండు నెలల క్రితం వివాహమైంది. దంపతులు ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో తాడుతో ఉరేసుకోవడం గురించి చెబుతూ... అలా చేసి చూపించేందుకు అలీ యత్నించినట్లు సమాచారం. ఆ సమయంలో అతడు నిల్చున్న కుర్చీ జారి కిందపడింది. గొంతుకు ఉన్న తాడు బిగుసుకుంది. దిగ్భ్రాంతికి గురైన భార్య కేకలు వేసింది. వెంటనే స్థానికులు వచ్చి అలీని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని