యువతిపై పోలీసుల అనుచిత ప్రవర్తన
యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
గుంటూరు: యువతిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో గుంటూరు అరండల్పేట ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్ రామును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ యువకుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసిన తనతోపాటు, తన తల్లిపై అనుచితంగా ప్రవర్తించారంటూ యువతి ఆరోపించింది. గత నెల 31న ఎస్సై బలాత్కారం చేశారంటూ హోంమంత్రి, ఎస్పీ కార్యాలయాలను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుంటూరు డీఎస్పీ సుప్రజకు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తాజాగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని సస్పెండ్ చేస్తూ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్తో పాటు చట్టవిరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణపై మరో కానిస్టేబుల్ హనుమంతరావును కూడా విధుల నుంచి బహిష్కరించినట్లు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు