సమత దోషులకు మరణశిక్ష
సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది.
ఆదిలాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సమత హత్యోదంతం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది. షేక్బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంలను దోషులుగా నిర్ధారిస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత నవంబర్ 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం సమీపంలో సమతపై నిందితులుసామూహిక హత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈ హేయమైన ఘటనపై ఆదిలాబాద్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 14న ఛార్జిషీటు దాఖలుకాగా.. డిసెంబర్ 23 నుంచి 31వరకు సాక్షుల విచారణ కొనసాగింది. జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు ప్రత్యేక కోర్టులో కొనసాగాయి.
కంటతడిపెట్టిన దోషి
తీర్పు వెలువరించే ముందు ఏమైనా చెప్పుకునేది ఉందా అని దోషులను న్యాయమూర్తి ప్రశ్నించారు. వారిపై మోపిన నేరం రుజువైందని తెలిపారు. దోషి షేక్బాబు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టాడు. తనకు వృద్ధులైన తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా తమను క్షమించాలని విన్నవించుకున్నారు. అనంతరం వారికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తీర్పు వెలువరిస్తూ ఈ ముగ్గురు దోషులు చేసిన నేరం చాలా ఘోరమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రూ.26 వేల జరిమానా
నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ముగ్గురు దోషులకు న్యాయమూర్తి రూ.26 వేల జరిమానా విధించారు. మొదటి దోషి నుంచి రూ.8 వేలు, మిగిలిన ఇద్దరి నుంచి చెరో రూ.9 వేల చొప్పున జరిమానా వసూలు చేయనున్నారు.
విచారణ జరిగిందిలా..
* సమతపై కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ వద్ద నవంబర్ 24న హత్యాచారం.
* నవంబర్ 27న నిందితులు షేక్ బాలు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూం అరెస్టు.
* కేసు విచారణకు డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు.
* డిసెంబర్ 14న నిందితులపై ఛార్జిషీట్ దాఖలు
* డిసెంబర్ 23 నుంచి 31 వరకు సాక్షుల విచారణ
* జనవరి 7,8 తేదీల్లో కొనసాగిన ప్రాసిక్యూషన్ వాదనలు.
* జనవరి 10, 20 తేదీల్లో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు విన్న ప్రత్యేక కోర్టు.
* జనవరి 30న తుది తీర్పు వెల్లడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ