జనగామలో జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం ఖిల్లా షాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్‌ టిన్నర్‌ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు ఛార్జింగ్‌ పెడుతుండగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది

Published : 01 Feb 2020 01:12 IST

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం ఖిల్లా షాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్‌ టిన్నర్‌ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు ఛార్జింగ్‌ పెడుతుండగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.  సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని