ఎల్బీనగర్‌లో వైష్ణవి ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య

ఎల్బీనగర్‌లోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అజయ్‌ ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ...

Published : 05 Feb 2020 00:47 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లోని వైష్ణవి ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు అజయ్‌ తన డైరీలో నలుగురి పేర్లు రాశారు. శివకుమార్‌, కరుణాకర్‌రెడ్డి, మెగారెడ్డి, కొండల్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. వాళ్ల వేధింపులతోనే అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను లోతుగా ఆరాతీస్తున్నారు. ఆర్థిక, ఆసుపత్రికి సంబంధించిన ఇతర వ్యవహారాలే అజయ్‌ ఆత్మహత్యకు కారణాలై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని