ఉగ్రవాది టుండా కేసు తీర్పు వాయిదా
ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా కేసు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఈనెల 18కి వాయిదా వేస్తూ నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని హుమయూన్నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సీసీఎస్లో పేలుళ్లకు...
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా కేసు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తీర్పును ఈనెల 18కి వాయిదా వేస్తూ నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని హుమయూన్నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సీసీఎస్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో టుండా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. గతనెల 21వ తేదీనే తీర్పు వెల్లడించాల్సి ఉండగా అది నేటికి వాయిదా పడింది. అయితే ఈ తీర్పును నాంపల్లి న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్లకు పాల్పడినట్లు టుండా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.
లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో కీలకంగా ఉన్న టుండా.. బాంబుల తయారీ, పేలుళ్లలో నిష్ణాతుడిగా పేరు పొందాడు. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత 1993లో ముంబయిలో జరిగిన వరుస పేలుళ్లలోనూ టుండా నిందితుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్లో తలదాచుకున్నాడు. అక్కడనుంచే ఐఎస్ఐ, పలు ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. 2008లో ముంబయిపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్కు ఇచ్చిన 20 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ టుండా పేరుంది. 2013 ఆగస్టులో భారత్-నేపాల్ సరిహద్దులో టుండాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి టుండాపై 40కి పైగా పేలుళ్లకు సంబంధించిన కేసులున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు