కాల్పులు జరిపింది ‘ఆప్’ సభ్యుడే: పోలీసులు
దిల్లీలోని షాహిన్బాగ్ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారణ చేసిన అనంతరం దిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు.
దిల్లీ: దిల్లీలోని షాహిన్బాగ్ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారణ చేసిన అనంతరం దిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీనియర్ అధికారి రాజేశ్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల షాహిన్బాగ్లో ఓ వ్యక్తి ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. అతడిని విచారించగా ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు, అతడి తండ్రి గత సంవత్సరం క్రితమే ఆప్ చేరినట్లు నిర్దారణ అయింది. అతడి ఫోన్లో సైతం ఆప్ సీనియర్ నాయకులతో దిగిన పలు ఫోటోలను గుర్తించినట్లు చెప్పారు. చివరకు నిందితుడు కపిల్ గుప్తా ఆప్కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్దారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?