అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ అతి వేగంగా దూసుకొచ్చి.. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో..

Published : 06 Feb 2020 00:40 IST

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ అతి వేగంగా దూసుకొచ్చి.. ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న అన్వర్‌బేగ్‌(40) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో జెఎన్ఎన్‌యూఆర్ఎం కాలనీలో నివసించే అన్వర్ బేగ్‌గా గుర్తించారు. అతని స్వస్థలం విజయవాడ. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

జాతీయ రహదారిపై కారు బీభత్సం
విజయవాడ వైపు నుంచి నగరానికి వస్తున్న ఓ కారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు రాగానే అదుపు తప్పింది. డివైడర్‌పైకి దూసుకెళ్లి సెంట్రల్ లైటింగ్‌ విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ  ప్రమాదంలో కారు మందు భాగం ధ్వంసం కాగా జాతీయ రహదారిపై రెండు స్తంభాలు నేలకొరిగాయి. కారులో ఉన్న వ్యక్తులు  ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని