తల్లిని చంపి ప్రియుడితో అండమాన్కు..!
బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్కి పరారయ్యింది. కూతురే కన్న తల్లిని చంపడం అరుదైన ఘటన అని..మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు
బెంగళూరులో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతుకం
బెంగళూరు: కన్నతల్లినే అత్యంత దారుణంగా హత్యచేసి ప్రియుడితో పరారైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అంతేకాదు ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రియుడితో కలిసి అండమాన్కు పరారైంది. పక్కా పథకం ప్రకారమే అమృత ఈ హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు గాలించిన అనంతరం పోలీసులు అమృతతో పాటు ప్రియుడు శ్రీధర్ రావుని అండమాన్లో అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమృత(33) సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. 2017 వరకు రెగ్యులర్గా పనిచేసిన అమృత, కుటుంబ సమస్యలతో ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే తాత్కాలికంగా పనిచేస్తోంది. అయితే పోలీసులు విచారణలో మాత్రం అమృత తన కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపిందన్నారు.
తండ్రి ఊపిరితిత్తుల కాన్సర్ కారణంగా అమృత కుటుంబం అప్పల్లో కూరుకుపోయింది. వీటన్నింటినుంచి బయటపడేందుకు తన తల్లి, సోదరుడిని హత్య చేసి చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె భావించింది. ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో అమృత తన తల్లి నిర్మల(52)ను వంటిట్లో ఉన్న చాకుతో దారుణంగా పొడిచింది. ఆ సమయంలో అలజడికి నిద్రలేచి వచ్చిన సోదరుడిని కూడా అదే కత్తితో పొడిచింది. అనంతరం తల్లీ, సోదరుడు చనిపోయారని భావించి తన బ్యాగుతో బయటకు వెళ్ళింది. అప్పటికే ఇంటి బయట బైక్పై సిద్ధంగా ఉన్న ప్రియుడు శ్రీధర్రావుతో కలిసి నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకొంది. ఆ బైక్ను అక్కడే వదిలేసి..ముందుగానే బుక్ చేసుకున్న విమానంలో పోర్ట్బ్లెయిర్కు పారిపోయారు. అక్కడే ఐదు రోజులపాటు గడిపేవిధంగా వీరు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఈ దాడిలో అమృత తల్లి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు సమీపంలో ఉండే తమ బంధువులకు ఫోన్ చేసి ప్రాణాలు దక్కించుకొన్నాడు.
తన ప్రియుడికి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం అండమాన్కు వెళ్ళానని అమృత పోలీసులకు చెప్పడం గమనార్హం. అయితే అమృత హత్య ప్లాన్ తన ప్రియుడికి తెలుసా? లేదా? అనే విషయం ఇంకా తేలలేదని పోలీసులు పేర్కొన్నారు. పోలీసు విచారణలో అమృత చెప్పిన విషయాలు ఇలా ఉండగా.. ఇవే కచ్చితమైన కారణాలు కాకపోవచ్చని..మానసిక కారణాలు ఏవైనా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరిని బెంగళూరుకు తీసుకొచ్చిన విచారించిన అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ