ఒంటరి మహిళలను వెనుక నుంచి వచ్చి.. 

ఇలా కొన్ని రోజులుగా సాగుతున్న అతడి దురాగతాలు సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో బట్టబయలయ్యాయి.

Published : 07 Feb 2020 00:40 IST

ముంబయి: ఒంటరిగా మహిళలు కనిపిస్తే వెనుక నుంచి వెళ్లి హత్తు కుంటాడు. వారిని లైంగికంగా వేధిస్తాడు. వారు ప్రతిఘటించే లోపే అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇలా కొన్ని రోజులుగా సాగుతున్న అతడి దురాగతాలు సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో బట్టబయలయ్యాయి. దీంతో పోలీసులు ఆ ఆకతాయి ఆట కట్టించారు. ఇంత జరిగినా నిందితుడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. 

ముంబయిలోని మాతుంగా రైల్వేస్టేషన్‌ బ్రిడ్జిపై ఒంటరిగా వెళుతున్న మహిళలను వేధిస్తున్న రాయ్‌జూర్‌ను తొలుత జనవరి 25న సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. అందులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కనిపించింది. దీంతో సీసీటీవీ ఫుటేజీలను గమనించగా.. తరచూ ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో మఫ్తీలో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతడిని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశారు. అతడిపై ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు బాధితులను కోరుతున్నారు. ఒకవేళ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోతే న్యాయపరంగా ఉన్న ఇతర అవకాశాలను పరిశీలించాలని యోచిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాయ్‌జుర్‌ ముంబయికి జీవనోపాధి కోసం వచ్చాడు. అతడికి భార్య, పిల్లలు కూడా ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని