కాషాయ ముసుగులో కామాంధుడు
భక్తిభావంతో ఆలయాలను దర్శించుకుంటున్న ఓ మహిళ సాధువు ముసుగులో ఉన్న ఓ కామాంధుడిని నమ్మి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. నల్లమల అభయారణ్యంలో ఈనెల 2న లభ్యమైన మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు
శ్రీశైలానికి వచ్చిన ముంబయి మహిళపై అత్యాచారం, హత్య
అక్కమహాదేవి ఆలయానికని తీసుకువెళ్లి అడవిలో అఘాయిత్యం
అచ్చంపేట పట్టణం, న్యూస్టుడే: భక్తిభావంతో ఆలయాలను దర్శించుకుంటున్న ఓ మహిళ సాధువు ముసుగులో ఉన్న ఓ కామాంధుడిని నమ్మి దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. నల్లమల అభయారణ్యంలో ఈనెల 2న లభ్యమైన మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు పూర్తిచేసిన నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీసులు గురువారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అచ్చంపేటలో డీఎస్పీ నర్సింహులు, సీఐ బీసన్న ఈ కేసు వివరాలు తెలిపారు. ముంబయికి చెందిన మహిళ(52)కు దైవచింతన ఎక్కువ. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకునేది. గతేడాది డిసెంబరులో తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. జనవరిలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సమంతమలైకి చెందిన సాధువు మట్కాస్వామి అలియాస్ పిలకస్వామి(62) కూడా పుణ్యక్షేత్రాలను తిరుగుతుంటాడు. కొద్దికాలంగా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో ఉంటున్నాడు. అక్కడే ముంబయి మహిళకు కనిపించిన పిలకస్వామి అడవిలో ఉండే అక్కమహాదేవి ఆలయం మహిమాన్వితమైనదని, దర్శించుకుంటే మంచిదని చెప్పాడు. సాధువని నమ్మిన ఆమె ఆ ఆలయాన్ని చూపించాలని కోరింది. జనవరి 25న ఇద్దరూ కలిసి కొద్దిదూరం జీపులో, మరికొంత దూరం బస్సులో ప్రయాణించి నల్లమల అభయారణ్యంలోని అటవీశాఖ రేంజ్ గేటు-168 సమీపంలో దిగారు. కాలినడకన అక్కమహాదేవి గుహల వైపు బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక మట్కాస్వామి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి హత్యచేసి పారిపోయాడు. ఈనెల 2న అటుగా వెళ్లిన అటవీ సిబ్బంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. కొంతదూరంలో ఆ మహిళకు చెందిన ఆధార్కార్డు, పాన్కార్డు, శ్రీశైలంలో బసచేసిన గది రశీదులు దొరికాయి. ఆధార్కార్డు ఆధారంగా ముంబయిలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీశైలంలో ఆమె బసచేసిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)