హయత్‌నగర్‌లో విషాదం

హయత్‌నగర్‌ రాఘవేంద్ర కాలనీలో నివసించే మమత(20), గౌతమి(21) స్నేహితురాళ్లు. శుక్రవారం ఉదయం మమత తల్లిదండ్రులు శుభకార్యం నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లగా,

Updated : 07 Feb 2020 18:19 IST

హయత్‌నగర్‌ : హైదరాబాద్‌ నగర శివారులోని హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. హయత్‌నగర్‌ రాఘవేంద్ర కాలనీలో నివసించే మమత(20), గౌతమి(21) స్నేహితురాళ్లు. శుక్రవారం ఉదయం మమత తల్లిదండ్రులు శుభకార్యం నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లగా, ఆమె సోదరుడు పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం 4గంటలకు ఆమె సోదరుడు ఇంటికి వచ్చి చూసేసరికి ..మమతతో పాటు ఆమె స్నేహితురాలు గౌతమి ఇంటి పైకప్పు ఇనుపరాడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.  ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని