రాంనగర్‌లో పేలుడు: వ్యక్తికి తీవ్రగాయాలు

రాంనగర్‌లోని వైట్‌హౌస్‌ హోటల్‌ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి....

Published : 09 Feb 2020 00:58 IST

హైదరాబాద్‌: రాంనగర్‌లోని వైట్‌హౌస్‌ హోటల్‌ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నాగయ్య చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెత్తకుప్పలో ఉన్న  పెయింట్‌ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో  డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఘటనాస్థలిని పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని