బంతి కోసం వెళ్లి బాలుడు మృతి

బంతి కోసం వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 10 Feb 2020 00:54 IST

హైదరాబాద్‌: బంతి కోసం వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గాభవానీ నగర్‌కు చెందిన ఎం‌. అఖిల్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఫిలింనగర్ కల్చరల్‌ సెంటర్‌లోని టెన్నిస్‌ కోర్టు వద్ద ఎవరికీ తెలియకుండా బంతులను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఎంఆర్‌సీ కాలనీవైపు ఉన్న గోడమీద నుంచి టెన్నిస్‌ కోర్టులోకి ప్రవేశించాడు. తన రెండు జేబుల్లో నాలుగు టెన్నిస్‌ బంతులు, చేతిలో మరో రెండు టెన్నిస్‌ బంతులతో గోడ దాటే క్రమంలో పక్కనే ఉన్న నియంత్రిక తగిలి గోడ మీద అలానే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి తండ్రి శేఖర్‌ ఐదు నెలల క్రితం మృతి చెందగా.. తల్లి యాదమ్మ ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కుమారుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని