ఈ ఫొటో చూస్తే.. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయరు!
ద్విచక్రవాహనం అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వారిలో వాహనం నడిపిస్తున్న యువకుడు గాలిలోకి ఎగిరి ఫుట్పాత్ పక్కన ఉన్న ప్రహరీకి, విద్యుత్ స్తంభానికి మధ్య...
వాహనం అదుపుతప్పి ఫుట్పాత్కు ఢీ
ఇద్దరు యువకుల దుర్మరణం
రాయదుర్గం : ద్విచక్రవాహనం అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వారిలో వాహనం నడిపిస్తున్న యువకుడు గాలిలోకి ఎగిరి ఫుట్పాత్ పక్కన ఉన్న ప్రహరీకి, విద్యుత్ స్తంభానికి మధ్య తల ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కన్నపల్లికి చెందిన గొర్ల సంతోష్ (26) నగరంలోని విద్యానగర్ దయానంద్నగర్లో ఉంటూ రైల్వేలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన బావమరిది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన అచ్చ రెహాన్ (21) నగరంలోనే ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్నాడు. వారిద్దరు ఆదివారం రాత్రి నానక్రాంగూడలోని తమ బంధువులను కలిసేందుకు కొత్తగా కొనుగోలు చేసిన యమహా ఎంటీ15 బైకు (టీఎస్ 07 బీడీటీఆర్ 6202)పై వచ్చారు. అదేరోజు రాత్రి 9.15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. రెహాన్ వాహనం నడిపిస్తున్నాడు. నానక్రాంగూడ నుంచి గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వైపు వస్తుండగా ట్రిపుల్ ఐటీ కూడలి సమీపంలోని (ఐడీబీఐ బ్యాంకు అవతలివైపు) విద్యుత్ ఉపకేంద్రం వద్దకు రాగానే బైకు అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీకొట్టింది. దీంతో రెహాన్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ఫుట్పాత్ పక్కన ఉన్న గోడ, విద్యుత్ సంభం మధ్య తల ఇరుక్కుని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంతోష్కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అతను కూడా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోష్ బంధువు తిప్పని రాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించగా కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.