దిల్లీలో అగ్ని ప్రమాదం

దేశరాజధాని దిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంద్క ప్రాంతంలో ఉన్న ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 10:30గంటల నుంచి మంటలు

Updated : 14 Feb 2020 05:44 IST

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంద్క ప్రాంతంలో ఉన్న ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 10:30గంటల నుంచి మంటలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. 

గత డిసెంబర్‌లోనూ దిల్లీలోని అనాజ్‌మండీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్యాగుల తయారీ దుకాణంలో మంటలు వ్యాపించడంతో 43 మంది మృతి చెందారు. అనాజ్‌మండీ ఘటన దిల్లీ చరిత్రలో రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని