స్క్రూడ్రైవర్‌తో పొడిచి...యాసిడ్‌ పోసి...

భార్యను భర్త స్క్రూడ్రైవర్‌తో పొడిచి అనంతరం ఆమెపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.

Updated : 17 Aug 2022 15:59 IST

బడి బయటే భార్యపై భర్త దాడి

కోల్‌కతా:  భార్యను భర్త స్క్రూడ్రైవర్‌తో పొడిచి అనంతరం ఆమెపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. నగరంలోని దక్షిణ శివారు ప్రాంతంలో బాధితురాలి కుమారుడు చదువుతున్న ఓ ప్రైవేట్‌ పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన జరిగింది. జయంత దాస్‌ అనే వ్యక్తి నగరంలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య గురువారం ఉదయం తన కుమారుడికి భోజనం ఇచ్చేందుకు పాఠశాలకు వెళ్లింది. కాగా జయంత దాస్‌ అక్కడకు వచ్చి ... భార్యను తల వెనుక భాగంలో స్క్రూడ్రైవర్‌తో పొడిచాడు. ఆమె అతన్ని ఆపే ప్రయత్నం చేయబోగా యాసిడ్‌ పోశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ‘భార్యపై అనుమానంతోనే దాస్‌ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాస్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాం’ అని కస్బా పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని