యువతిని రక్షించబోయి... ఇద్దరి మృతి

నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్‌ సమీపంలో (కర్ణాటక సరిహద్దు) కృష్ణానదిలో దిగి  ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పాలకొల్లుకు చెందిన రామకృష్ణరాజు, శ్రీహరి రాజు వారి

Published : 17 Feb 2020 01:46 IST

నారాయణపేట: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్‌ సమీపంలో (కర్ణాటక సరిహద్దు) కృష్ణానదిలో దిగి  ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పాలకొల్లుకు చెందిన రామకృష్ణరాజు, శ్రీహరి రాజు వారి బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఇవాళ ఉదయం బంధువులతో కలిసి సరదాగా కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. బంధువులు వెళ్లిపోయినా ఐదుగురు మాత్రం నదిలో స్నానాలు చేస్తూ గడిపారు. వారిలో ఓ అమ్మాయి కాలుజారి పడిపోగా  ఆమెను రక్షించేందుకు నలుగురు నదిలోకి వెళ్లారు. సమీపంలో ఉన్న జాలరి గోపాల్‌ ముగ్గురు అమ్మాయిలను రక్షించగా.. ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఎంత గాలించినా దొరక్కపోవడంతో  కృష్ణా మండల కేంద్రం నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. నదిలో విస్తృతంగా గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని